ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26
తెలంగాణ : నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని సత్యనారాయణ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీ విజయ్ సేన్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేశారు















