EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యూరియా బుకింగ్ కోసం యాప్ :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 15

గత ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ ఇబ్బందుల దృష్ట్యా రైతులకు యూరియా సరఫరా కోసం ప్రభుత్వం నూతన విధానం తీసుకు వచ్చింది.రైతులు ఎరువుల దుకాణాల ముందు క్యూ కట్టాల్సిన పని లేకుండా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు త్వరలో మొబైల్ యాప్ విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుత యాసంగికి సరిపడా యూరియాను అన్నదాతలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా… కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నెలకు కేటాయించిన యూరియా కూడా త్వరలోనే రాష్ట్రానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top