EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ౩౦న హిమాయత్ నగర్ టీటీడీ శ్రీవారి వైకుంఠ దర్శనం

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 29

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల ౩౦న హిమాయత్ నగర్ టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులకు శ్రీవారి వైకుంఠ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ హిమాయత్ నగర్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నేమూరి శంకర్ గౌడ్ వెల్లడించారు.ఆదివారం టీటీడీ ఆవరణలోని హిమాయత్ నగర్ తిరునిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో టీటీడీ డిప్యూటీ ఏఈవో రమేష్ తో కలిసి మాట్లాడారు. ఈనెల 29వ తేదీ తెల్లవారు ఝామున 1.30 గంటల నుంచి 30 వ తేది రాత్రి 11 గంటల వరకు భక్తులను వైకుంఠ ద్వారా శ్రీవారి సర్వదర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మంచినీరు, విద్యుత్, ట్రాఫిక్ సమస్య లేకుండా శ్రీవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. దర్శనం అనంతరం భక్తులను తీర్థప్రసాదలతోపాటు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నామని ఆయన చెప్పారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి జరిగే పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 30వ తేదీ తెల్లవారు ఝామున 12 గంటల నుంచి శ్రీవారికి ఏకాంత సేవ 12.20 నుంచి 12.40 తిరుప్ప సేవతోపాలు తోమాల సేవ, సహస్ర ఆర్చన, ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇతర సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. 1:30 నుంచి రాత్రి అర్థరాత్రి వరకు భక్తులకు సర్వ దర్శనం కొనసాగుతుందన్నారు. మధ్య, మధ్యలో శ్రీవారికి ఏకాంత సేవలు కొనసాగుతాయని, ప్రత్యేకంగా వృద్దులు, వీఐపీలు కూడా స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. దేవాలయం సిబ్బంది, పోలీసులు సూచించిన ప్రదేశాలలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఆయన భక్తులకు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ అధికారులు మణికంఠ శ్రీనివాస్, లక్ష్మీపతి, అర్చక వేద పండితులు ప్రహ్లాదచారి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top