ఈతరం భారతం జనవరి 3
కరీంనగర్ : జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ కేజీబీవీకి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు, ప్రముఖ కవయిత్రి, రచయిత్రి పత్తెం వసంత సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డు -2026 ను అందుకున్నారు. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్, సావిత్రిబాయి ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి అవార్డును వసంతకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఈటెల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మణిమంజరి సాగర్, తెలంగాణ ప్రభుత్వ బీసీ కమీషన్ సభ్యురాలు బాలలక్ష్మి, బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొని వసంతకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డును అందుకున్న వసంతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.















