ఈతరం భారతం/ కూసుమంచి /నవంబర్ 6:
తుఫాన్ వల్ల దెబ్బతిన్న పొలాలను పరిశీలించాలి వెళ్ళడానికి దారి లేకపోతే ఏంటి పడవలో వెళ్ళాడు రైతుల కోసం ఓ అధికారి వివరాలు ఇలా ఉ న్నాయి.
కూసుమంచి మండలం పాలేరు క్లస్టర్ ఏఈఓ సాయిరాం తన వృత్తి పట్ల నిబద్దత చాటారు.మంగళవారం తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించడానికి ఓ మత్స్యకారుని సహాయంతో చెరువులో పడవ ప్రయాణం చేసి తుఫాన్ కారణంగా నష్టపోయిన ఓ రైతు పొలాలను పరిశీలించాడు.ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పలువురు ఏఈఓ సాయిరాం కు అభినందనలు తెలియజేస్తున్నారు.రైతు పొలంకు వెళ్ళడానికి దారి లేకపోవడంతో అప్పటికే ఒకసారి వాయిదా వేసుకున్నారు కానీ రైతు నష్ట పోవద్దని ధైర్యం చేసి ఇలా పడవలో వెళ్ళాడు.. అందరూ ఏఈఓ సాయిరాం సార్ సలాం మీకు అంటున్నారు..















