EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి వరదనీటిని క్రిందికి విడుదల

హైదరాబాద్ జూలై 28 (ఈతరం భారతం );తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది.దీనితో తుంగభద్ర ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి వరదనీటిని క్రిందికి వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో 96, 836 క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 1,00, 720 క్యూసెక్కులు నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం (Water storage capacity) 105 టిఎంసిలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 75 టిఎంసిలుగా ఉంది. గేట్ల సమస్య కారణంగా ఈ ఏడాది 80 టిఎంసిలే అధికారులు నిల్వ చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top