EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ రూ.25,000/- పెన్షన్ మంజూరు చేయాలి : అర్హత ఉన్న ప్రతి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలి

హైదరాబాద్ ఆగస్టు 6(ఈతరం భారతం );తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు ఉద్యమకారుల సంఘం చైర్మన్ బండి రమేష్ నేతృత్వంలోని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రబాకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 1. అర్హత ఉన్న ప్రతి పాల్గొనేవారికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు.2. తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/- పెన్షన్ మంజూరు.3. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవడం.4. తెలంగాణ అమరవీరులు మరియు పోరాట యోధులను అధికారికంగా గుర్తించడం మరియు సత్కరించడం.5. తెలంగాణ పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించిన అర్హులైన కార్యకర్తలందరికీ అదనపు సంక్షేమ ప్రయోజనాలు మరియు అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరతారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమస్యలను ముఖ్యమంత్రి ద్రుష్టి కి తీసుకేల్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బండి రమేష్ తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top