సంగారెడ్డి ఆగస్టు 21 (ఈతరం భారతం);: మావోయిస్టులపై జరిగే ఎన్కౌంటర్ లకు వేతీరకంగా ఈ నెల 24 న వరంగల్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చెయ్యండి పిఒడబ్లు జాతీయ కార్యదర్శి సంపంగి పద్మక్క పిలుపు నిచ్చారు. ఎన్కౌంటర్ లకు వ్యతిరేకంగా ఈ నెల 24 న వరంగల్ లో బహిరంగ సభ పోస్టర్ ను ఆమె విడుదల చేసారు. మావోయిస్టులపై పోలీసులు జరుపుతున్న యుద్ధం ఆగడం లేదు, పాలకుల యుద్దనితిలో మార్పులేదు,ఒక వైపు మావోయిస్టు పార్టీ 5 నెలలుగా10 ప్రకటనలతో శాంతి చర్చల కోసం మెదవు లతో, అఖిల భారత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో శాంతి కమిటీలను ఏర్పర్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ,చంపేస్తాం,నిర్మూలిస్తాం, అనే భాష తప్ప ఈ దళారీ దోపిడీ పాలకులు,ప్రజాస్వామిక వాతావరణం కల్పించడంలేదన్నారు. మధ్య భారతంలో శాంతిని నెలకొల్పాలని,ఆదివాసీల జీవించే హక్కులను కాపాడాలని అదే విధంగా మావోయిస్టుల ఉద్యమని కూడా కొనసాగించాలి,అవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలతో కూడిన ప్రజాస్వామిక అంశాలు,వాటిని మోడీ, అమిత్ షా ల ప్రభుత్వం ఎప్పటికైన అమలు చేయాలని ఆమె డిమాండ్ చేసారు.హక్కుల సంఘలకు,నిజనిర్ధారణకు అవకాశాలు కల్పించి జరిగిన అన్ని హత్యకండల పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపి నేరస్తులను చట్టబద్ధంగా శిక్షించాలని దీని వలన ప్రజాస్వామ వేవువాస్తపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుంది,కానీ మోడి ప్రభుత్వం 28 రకాల 7 లక్షల కోట్ల కనిజ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే ఆదివాసీ ప్రజలపై చేస్తున్న యుద్ధమే ” కగర్ ఆపరేషన్ యుద్ధం మని పేర్కొన్నారు.కార్పోరేట్ సంస్థల కనుసన్నల్లోనే, ఈ క్కడ రాజ్యపాలన సాగుతున్నది ,మావోయిస్టు రహిత భారత్ ను నెలకొల్పుతామని కార్పొరేట్ సంస్థలు, ల్యాండ్ మపియ, హై రైన్ ,లిక్కర్, వైట్ కలర్ క్రైమర్స్ తో బడా పెట్టుబడి దార్ల చేతిలో అడివి మొత్తం చిక్కుకొని ఉన్నదిమధ్యబరతంలో ఆదివాసీల హాన నానికి వ్యతిరేకంగా పోరాడుదాం,1990 పే సా చట్టం,2006 అటవీ హక్కుల చట్టాని అమలు చెయ్యాలి,బాస్టర్లో ఏర్పాటు చేసిన వందలాది సాయుధ పోలీస్ బలగాలను,క్యాంపులు వెంటనే ఎత్తి వేయాలి,ఆపరేషన్ కగర్ ను వెంటనే ఆపి వేయాలి,శాంతి చర్చలను కొనసాగించాలి,ఎన్కౌంటర్ పేరుతో అణిచివేస్తున్న ఆదివాసీలను,జీవించే హక్కును రక్షించాలి,కాల్పుల విరమణ ప్రకటించాలి అని పద్మక్క డిమాండ్ చేసారు.















