EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

“నిందితుడిని చంపేయాలి”…సహస్ర తల్లి రేణుక కన్నీటి పర్యంతం

హైదరాబాద్‌: ఈతరం భారతం ఆగస్టు 23 :నగరాన్ని కుదిపేసిన సహస్ర హత్య కేసు విషయంలో మృతురాలి తల్లి రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను అత్యంత పాషవికంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, చట్టం ద్వారా కాకపోతే తామే న్యాయం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

రేణుక ఆవేదన

“నా కూతుర్ని హత్య చేసినట్లు ఆ అబ్బాయిని కూడా హత్య చేయాలి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ ఘటన తరువాత తన కుటుంబంపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయని,“నా మీదా, నా భర్త మీదా మా కూతుర్ని మేమే చంపుకున్నామని విమర్శలు చేశారు” అంటూ వేదన వ్యక్తం చేశారు. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కోల్పోవడం తల్లిదండ్రుల జీవితంలోనే అతిపెద్ద దుఃఖమని అన్నారు.

రేణుక మాట్లాడుతూ…“నా కొడుకులో ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. అక్కను చంపిన వాడిని నేనే చంపుతాను అని మాట్లాడుతున్నాడు. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణానికి ఒడిగడతాడా?” అంటూ ప్రశ్నించారు.

నిందితుడి కుటుంబంపై ప్రశ్నలు

మొబైల్‌ తీసుకొచ్చినప్పుడే నిందితుడు తల్లిదండ్రులు పరిశీలించి ఉంటే, ఈ రోజు తన కూతురు ప్రాణాలు నిలిచేవని రేణుక పేర్కొన్నారు.ఈ ఘటనలో మైనర్‌ అబ్బాయి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపించారు.

న్యాయం కావాలి

“మాకు న్యాయం జరగాలి. నిందితుడిని మా ముందుకు తీసుకురావాలి” అని రేణుక డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడకపోతే, ఇది సమాజంలో మరిన్ని అమానుష ఘటనలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు.

 

Related News

Select the Topic
Scroll to Top