EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి   బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్

ఈతరం భారతం హైద్రాబాద్ జనవరి 31

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలనిబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.శనివారం.బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయం లోరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అధ్యక్షతన బీసీలకు42 శాతం రిజర్వేషన్ పైన సమావేశం జరిగింది.ఈ స్ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఉమ్మడిమెదక్ జిల్లాకు చెందిన మున్సిపాలిటీలలో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలకు వెళుతుంది. గత ఎన్నికలలో 34 శాతం మున్సిపాలిటీలలో అమలు చేశారు ఇప్పుడు దానిని 28% తగ్గించడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ఉద్దేశపూర్వకంగా తెలంగాణలోని వెనకబడు తరగతులను మభ్యపెడుతూ బీసీలను రాజకీయంగా అణచివేయాలని కుట్రతో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారు ఒకవైపు కోర్టు కేసు నడుస్తుండగా తీర్పురాకుండానే ఎన్నికలు జరపడం న్యాయవిరుద్ధం రాజ్యాంగ విరుద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుచున్నాము. ఒకవైపు కోర్టు కేసులు మరియు బీసీలందరూ ధర్నాలురాస్తా రోకోలు మరియు దీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జరిగే ఎన్నికలలో బీసీలను అత్యధిక. మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు ప్రభు గౌడ్ గారు విజ్ఞప్తి చేశారు వచ్చేది బీసీల రాజ్యాధికారం అని రాజ్యసభ సభ్యుడు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్ ఆర్.కృష్ణయ్య అన్నారు బీసీల రిజర్వేషన్ కు ప్రభుత్వం అడ్డుపడితే 5 లక్షల మందితో హైదరాబాదులో బీసీ గర్జన చేస్తామని ఆర్ కృష్ణయ్య అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కార్యనిర్వాహక అధ్యక్షలుడాక్టర్ ఆర్. అరుణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ మరియు కార్యదర్శులు సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top