EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉపాధి హక్కు పై మోడి కుట్ర 33 కోట్ల మంది కూలీల పై ప్రభావం

ఈతరం భారతం సంగారెడ్డి జనవరి 31

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా మోడీ అసలు రూపం బయట పడిందని పిఓడబ్లు జాతీయ కార్యదర్శి వెలుగు వనిత ఆరోపించారు ఉపాధి హామీ పథకాని రక్షించు కుందo , ప్రభుత్వ ప్రజా వే తిరేక విధానాలను తీపి కొడుడం నినాదంతో ఈ రోజు pow మహిళా సంఘం జాతీయ కార్యదర్శి వెలుగు వనిత సంపంగి పద్మక్క ఆధ్వర్యంలో జరిగినా ధర్నా కార్యక్రమం లో వెలుగు వనిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అబివృద్ధి జరిగినప్పుడే అసలైన ప్రయోజనం కల్గుతుంది అనే మహాత్మా గాంధీ కలను సాకారం చెయ్యాలనే సంకల్పం తో నే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెట్టారని ,అందుకు గాను పథకానికి బడ్జెట్ లో నాలుగు శాతం నిధులు కేటాయించారని దీని వల్ల పేదలకు కొంత మేలు జరిగిందని మోదీ అధికార పగ్గాలు చేపటాక ఉపాధి కూలీలా పై కక్ష పెంచుకొని ఈ చట్టానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరం లో 1,37 శాతానికి కుదించారని విమర్శించారు, దానికి అతిక్రమించి 40 శాతానికి పెంచి కాంట్రాక్టు లకు అనుకూలంగా ఉపాధి హామీ పథకాని మార్చారు అని వెలుగు వనిత మండి పడ్డారు మోడీ చట్టానికి ఆధార్ ప్రామాణికమే కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ,ఆధార్ కు అనుసంధానం చేసి కోటి కి పైగా జాబ్ కార్డులు,ఏడు కోట్ల మంది లబ్ధిదారులకు ఉపాధి హామీ నీ రద్దు చేశారని,మోడీ ప్రభుత్వని కి కూలీలంటే అంతా కక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టాని పునరుదరిo చే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు, మహాత్మా గాంధీ పైగౌరవం ఉంటే ఉపాధి హామీ చట్టానికి రూ 2,50 లక్షల కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు,పద్మ మాట్లాడుతూ వామపక్షాలు ఒత్తిడి మేరకు వచ్చిన న రే గా ను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం పెదాల పొట్టకొటిందని , కొత్త గా తీసుకుని వచ్చిన వీ బీ జీ ఆర్ ఏ ఎం జి చట్టాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు,దేశ వ్యాప్తంగా 33 కోట్ల మంది కూలీల హక్కుల ను కలుస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు , ఈ ప్రోగ్రామ్ లో సంతోష,ప్రమీల, సంగన్న, సుజాత, రాధ, తదితరు లు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top