ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 18:
ఫిబ్రవరి 28న సూర్యాస్తమయం తర్వాత సుమారు 30 నిమిషాలకు ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు (బుధుడు,శుక్రుడు,గురుడు,శని, యురేనస్,నెప్ట్యూన్) కనిపించనున్నాయి.వీటిని చూడటానికి పశ్చిమ (పడమర) దిశలో చూడాలి. శుక్రుడు,గురుడు మరియు శని గ్రహాలను నేరుగా కంటితో చూడవచ్చు, కానీ యురేనస్ మరియు నెప్ట్యూన్లను చూడటానికి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ అవసరం.ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటేనే ఇవి స్పష్టంగా కనిపిస్తాయి.















