హైదరాబాద్ ఫిబ్రవరి 19 ఈతరం భారతం:
నగరంలోని నార్సింగి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికకు గంజాయి తాగించి ఆ మత్తులో ఉండగా.. ముగ్గరు రౌడీ షీటర్లు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక ఛార్మినార్ పిఎస్ పరిధి నుంచి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. నార్సింగిలో తన నాన్నమ్మ ఉండటంతో బాలిక అక్కడకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ దారుణానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలిక నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీకి చెందిన బాలికగా గుర్తించారు
.















