ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 7:
దేశవ్యాప్తంగా ఎండలు భగభగ మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు ప్రమాదకర స్థాయిలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. అటు ఏపీ, తెలంగాణల్లోనూ ఎండల తీవ్రత ఒక్కసారిగా దారుణంగా పెరిగింది. మరో మూడు రోజులపాటు ఈ ఎండల ప్రతాపం కొనసాగుతుందని.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.















