EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 30

ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  చేతుల మీదుగా నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తో పాటు అక్రిడేషన్ కార్డుల సెలక్షన్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖ జర్నలిస్టులు కార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. రేపటి నుంచి జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులను జారీ చేసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించామని వెల్లడించారు. కార్డుల పంపిణీ పూర్తయిన తరువాత జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టవలసిన వివిధ కార్యక్రమాల గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు.అదే విధంగా ఒక సంస్థలో అక్రిడేషన్ కార్డు పొందిన జర్నలిస్టులు మరో సంస్థకు మారినప్పుడు వారు కార్డు రిప్లేస్మెంట్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రజాప్రభుత్వంలో కల్పిస్తున్నామని ప్రకటించారు. కార్డుల పంపిణీలో ఆలస్యమైనా కూడా పారదర్శకమైన విధానాలను అవలంబించడానికే ప్రాధాన్యమిచ్చామని మంత్రి పొంగులేటి గారు స్పష్టం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 46వేల మందికిపైగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను జారీ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేశ్ షెట్కర్ , ఎమ్మెల్సీ అంజిరెడ్డి , మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , ఐఅండ్పీఆర్ కమిషనర్ ముకుందరెడ్డి , అక్రిడేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

 

Related News

Select the Topic
Scroll to Top