ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మహేషుని లక్ష్మయ్య మే 4 :
కేరళ ఎన్నికలలో…. కాంగ్రెస్ పార్టీ కుటమీ ఘన విజయం సాధించిన నేపథ్యం లోసంబరాలు జరుపుకున్నారు.మెట్టు సాయికుమార్ చైర్మన్ ఫిషరిస్.. నేతృత్వం లో గాంధీ భవన్ లో బాణా సంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్బంగా మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ డా,,బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు,ప్రజాస్వామ్యం ఉన్నంత మేరకు బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం..ప్రజాస్వామ్యాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది..బీజేపీ విభజన పేరుతో మతతత్వం పేరుమీద రాజకీయాలు చేయడమే శాశ్వతం అనుకుంటున్నారు..ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుంది.కేరళ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం పట్ల కేసి వేణుగోపాల్ నాయకత్వంలో సతీషన్ , చేణితలకు అభినందనలు తేలిపారు.














