ఈతరం భారతం హైద్రాబాద్ మే 6:
తెలంగాణా ప్రభుత్వం భర్తీ చేసిన కార్పొరేషన్ పదవుల్లో,బ్రాహ్మణ కార్పొరేషన్ విషయం లో,చైర్మన్ పదవి,మరియు వైస్ చైర్మన్ పదవి,రెండు కూడా బ్రాహ్మణుల చేతనే భర్తీ చేయడం మూలంగా, “ శ్రీ వైష్ణవులకు “ తీవ్ర అన్యాయం జరిగింది.ఇది సరైంది కాదని శ్రీ వైష్ణవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇప్పటికైనా,డైరెక్టర్స్ ను నియామకం చేసే సందర్భం లో,50 శాతం పదవులు శ్రీ వైష్ణవులకు కేటాయించి,తగు సమ న్యాయం చేకూర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు లను కోరారు .మీకు శ్రీ వైష్ణవుల సహకారం అవసరం ఉంటే మా విజ్ఞప్తి పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేసారు.














