EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వచ్చే నెల 8న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ..

ఈతరం భారతం హైదరాబాద్ మే 6

హైదరాబాద్ నగరంలో ఏటా ఇచ్చే చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూన్ 8వ తేదీన బత్తిని కుటుంబం ఈ మందును పంపిణీ చేయనుంది. ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీగా జనం వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.చేప మందు పంపిణీ కార్యక్రమం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనుంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని హరినాథ్ గౌడ్ వారసులు ఈ సేవను అందిస్తారు. వేలాది మంది వచ్చే అవకాశం ఉన్నందున ఎగ్జిబిషన్ మైదానంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదం కోసం వచ్చే వారు ముందుగానే వేదిక వద్దకు చేరుకోవడం మంచిది.

దశాబ్దాల కాలంగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీనిని తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు. ప్రభుత్వం కూడా భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. జూన్ 8న ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.

Related News

Select the Topic
Scroll to Top