EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తమిళనాడు ప్రజలు టీవీకేకు ఇచ్చిన తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న గవర్నర్

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మహేషుని లక్ష్మయ్య మే 7

తమిళనాడు ప్రజలు టీవీకేకు ఇచ్చిన తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారురాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న గవర్నర్ . ప్రజాతీర్పును గౌరవించి తీరాలనిటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారుగాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ108 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరం. గవర్నర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసేట్లు ఉంది.గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ నుంచి వస్తున్నాయని అనుమానాలు కలుగుతున్నాయిసింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశమివ్వాలని సర్కారియా కమిషన్, బొమ్మై కేసు సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా చెబుతున్నాయి

గవర్నర్‌కు రాజ్యాంగం చదవడం తెలియదా — లేక రాజ్యాంగానికి వ్యతిరేఖంగా ప్రవర్తించాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా?తమిళనాడులో గవర్నర్ ద్వారా పాలించాలని బీజేపీ చూస్తోంది — 59 సంవత్సరాల ద్రావిడ పార్టీల పాలనకు ప్రజలు చెక్ పెట్టిన మార్పును అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఆయుధంగా వాడుకుంటోంది. కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన తర్వాత కూడా అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగవర్నర్ కేరళ పర్యటన పేరుతో మరింత జాప్యం చేయడం యాదృచ్ఛికం కాదు… కుట్ర రాజకీయాల్లో భాగమే.విజయ్ రెండుసార్లు రాజ్‌భవన్‌కు వెళ్ళినా వట్టిచేతులతో తిరిగిరావడం చూస్తే , గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉన్న బీజేపీ గేట్‌కీపర్ అని స్పష్టమవుతోందిరాజ్యాంగం ప్రకారం గవర్నర్ హోదా నామమాత్రమే  విచక్షణాధికారాన్ని బీజేపీ కోసం దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ద్రోహం అని విమర్శించారు.

కోట్ల మంది ఓట్లు వేసి విజయ్ పార్టీని గెలిపిస్తే  వారి కలలను గవర్నర్ రాజ్‌భవన్‌లో బంధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ.గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి దాన్ని బీజేపీ రాజకీయ పావుగా వాడుకుంటే దేశంలో ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదం అని అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top