ఈతరం భారతం కరీంనగర్ మే 16
శంకరపట్నం మండల కేంద్రంలో సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా ట్రాలీకి తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరల పెంపుతో సామాన్య ప్రజానీకంపై పెనుభారం పడుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.














