ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 20;
పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఆయనకు వారం రోజులపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి అధికారులు ఆయన్ని విడుదల చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ పోలీసులు బగీరథ్ను మే 16న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు భగీరథ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు కావడంతో పోలీసులు ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.















