EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అయోధ్య విరాళాల దుర్వినియోగం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు!

ఈతరం భారతం న్యూఢిల్లీ జులై 14

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరిపి..కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిధుల దుర్వినియోగంపై న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి, రామాలయ నిర్వహణను చూసుకునే ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు కూడా తమ సమాధానాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నిధుల దుర్వినియోగంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ సిట్ బృందంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారనే వివరాలను కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (జూలై 20, 2026) వాయిదా వేసింది.

Related News

Select the Topic
Scroll to Top