EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ మాస వేడుకలు.. పోటెత్తిన భక్తులు!

ఈతరం భారతం విజయవాడ ఆగస్టు 14 శుక్రవారం

విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం శ్రావణ మాస సంబరాలతో కళకళలాడుతోంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తడంతో అమ్మవారి సన్నిధి భక్తజనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమైన తేదీలు మరియు వేడుకల వివరాలు..

ఆగస్టు 21: శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన ‘వరలక్ష్మీ వ్రతం’ ఘనంగా నిర్వహించనున్నారు.

ఆగస్టు 27, 28, 29: అమ్మవారి ఆలయూలో త్రిదినాల పాటు అత్యంత పవిత్రంగా ‘పవిత్రోత్సవాలు’ జరగనున్నాయి.

సెప్టెంబర్ 4: అమ్మవారి సన్నిధిలో భక్తుల కోసం ‘సామూహిక వరలక్ష్మీ వ్రతాలు’ నిర్వహించనున్నారు.

శ్రావణ మాసం ముగిసే వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తగిన క్యూలైన్లు, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top