ఈతరం భారతం తిరుమల జూన్ 6
NRIలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే వారికి పాస్పోర్టు, వీసా ఆధారంగా టీటీడీ సుపథం ద్వారా రూ.300 టికెట్తో దర్శనం కల్పిస్తోంది. ఐతే వారికి ఈ కాలపరిమితి సరిపోవట్లేదని వినతులు రావడంతో గడువును 90 రోజులకు పెంచింది.ఇవాల్టి నుంచే ఇది అమలు . ఇక పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది.














