ఈతరం భారతం కరస్పాండెంట్/తిరుపతి/ మనోజ్ కుమార్/ఏప్రిల్ 23:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి పట్టణంలో అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం ప్రాంతంలో వ్యభిచారం నిర్వహణ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు, ఈరోజు ఉదయం అలిపిరి పోలీసులు ప్రత్యేక దాడి నిర్వహించారు.పోలీసులు ఒక నివాస గృహంపై సోదాలు నిర్వహించగా, అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒక మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బయటపడగా, అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దాడి సమయంలో ఒక బాలికను రక్షించి, ఆమెను సురక్షితంగా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత సంబంధిత సెక్షన్లు, అనైతిక వ్యభిచార నిరోధక చట్టం , మరియు బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి గౌరవనీయ న్యాయస్థానంలో హాజరు పరిచారు, కేసు దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., మాట్లాడుతూ, “జిల్లాలో వ్యభిచారం, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలపై పోలీస్ శాఖ జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా బాలల రక్షణకు సంబంధించిన కేసుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తాము. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచు తాము ,ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తెలిపారు.



