EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బాబు జగ్జీవన్ రామ్ కి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఈతరం భారతం  అమరావతి ఏప్రిల్ 5

మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నేతలు, కంచర్ల శ్రీకాంత్, ఉండవల్లి శ్రీదేవి, పిల్లిమాణిక్యాలరావు, బాలకోటయ్య తదితరులతో కలిసి బాబూ జగ్గజీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు.

ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ అందించిన సేవల్ని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించటంతో పాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించారని కీర్తించిన ముఖ్యమంత్రి. పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఎన్నో సంస్కరణలు అమలు చేసిన మహనీయుడని పేర్కొన్న సీఎం చంద్రబాబు . బాబూ జగజ్జీవన్ రామ్ స్పూర్తితోనే ప్రభుత్వం నడుస్తోందని.. ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేశామని తెలిపిన ముఖ్యమంత్రి.

• దళిత వర్గాలకు న్యాయం జరగాలన్నదే టీడీపీ విధానం, ఎస్సీల అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ టీడీపీనే

• ఉమ్మడి ఏపీలో జగజ్జీవన్ రామ్ రాష్ట్ర మంతటా పర్యటించారు. ఎన్టీఆర్‌తో జగజ్జీవన్ రామ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

• బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ఆయనకు నివాళి అర్పించాం

• ఎస్సీ వర్గీకరణతో అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేశాం. ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమ న్యాయం జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం

• దళితుల సాధికారిత కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్న ముఖ్యమంత్రి

Related News

Select the Topic
Scroll to Top