ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 18 :తెలంగాణ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే హైకోర్టు వచ్చే నెల 30 లోపు నిర్వహించాలని గడువు విధించినందున అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలకు వెళ్లాలనే దిశగా అధికార పార్టీలో చర్చలు సాగుతున్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పట్టుబడతున్నారు. ఇక ఈ నెల 23న పీఏసీ సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.















