ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 7 :తెలంగాణ : బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన “ఛలో బస్ భవన్” కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ చేరుకుని, పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.















