ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 6
సుప్రసిద్ధ సాహితీవేత్త, విశిష్ట విమర్శకులు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు కు డాక్టర్ వాసా ప్రభావతి జీవిత సాఫల్య ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ నాంపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం సాయంత్రం కిన్నెర ఆర్ట్ థియేటర్స్, వాసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆచార్య నిత్యానందరావు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితలు సుధామ, శైలజామిత్ర, పాలపిట్ట సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వర్లు, పొత్తూరి సుబ్బారావు, మద్దాళి రఘురాం, డాక్టర్ వాసా ప్రకాష్, జె మీనాక్షి, పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.














