ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5 :తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించే అధికారులు.. బిల్లుల చెల్లింపు విషయంలో లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించేందుకు టోల్ ఫ్రీ నంబర్ని అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు 18005995991 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే.. సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని, బిల్లులను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.















