Jul 17, 2025 ఈతరం భారతం, హైదరాబాద్ :తెలంగాణ : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రాత్రి వేళల్లో మాత్రమే చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఇక నుంచి పగటి పూట కూడా చేస్తామని నగర జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఖైరతాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఆయన పరిశీలించారు. పగలైనా, రాత్రైనా మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.















