EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈసీని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య : ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ 

హైదరాబాద్ ఆగస్టు 11 (ఈతరం భారతం):బ్రిటిష్ కాలంలో భారతీయులందరికీ ఓటు హక్కు లేదు దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది అప్పట్లో బీజేపీ , ఆర్ఎస్ఎస్, హిందూ మహా సభ సంస్థలు మను ధర్మం కోసం దేశానికి స్వాతంత్ర్యం వద్దని కొట్లాడాయన్నారు. మను ధర్మం కోసం బీజేపీ దాని అనుబంధ సంఘాలు రాజ్యాంగ బద్ద సంస్థలను బలహీన పరిచే పరిస్థితి కర్ణాటక మహాదేవ బలి పురంలో దొంగ ఓట్ల పై రాహుల్ గాంధీ గారు డాక్యుమెంట్ తో సహా నిరూపించారు ఓట్ల చోరీ పై రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ దాని అనుబంధ సంఘాలు నేతలు దాడి చేసే పరిస్థితి దాపురించింది దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడిని, ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడం పట్ల బ్లాక్ డే గా పరిగణించాలి ఈసీని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.ఓట్ల చోరీ చేసి అధికారంలో వచ్చిన వాళ్ళు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్ కమిషన్ దొంగలను సస్పెండ్ చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది రాహుల్ గాంధీ బయటపెట్టిన డేటాను తీసుకొని బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావు ఓట్ల చోరీ పై నిజాలు చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ లో దొంగలు దూరారు.బీజేపీ తో కలిసి ఓట్ల చోరికి పాల్పడ్డారు బీహార్ లో గెలిచిన ఎంపీల తో రామచంద్ర రావు రాజీనామా చేపిస్తారా కేంద్ర ప్రభుత్వం ఒకరోజు కూడా కొనసాగేందుకు అర్హత లేదన్నారు.

Related News

Select the Topic
Scroll to Top