ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 1
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుండగా.. ఈ ఇళ్లకు ఆగస్టు 10లోగా దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ‘డేట్ ఎక్స్డెంట్ చేసే ఆలోచన లేదు. అర్హులు ఆలోపే అప్లై చేసుకోవాలి. ఇల్లు రాని వారికి రూ.10వేల డిపాజిట్ డబ్బు రిఫండ్ చేస్తాం. లబ్ధిదారులకు అపార్ట్మెంట్లో 20-22 గజాల అన్డివైడెడ్ షేర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఆగస్టు చివర్లో టవర్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి’ అని పేర్కొన్నారు














