హైదరాబాద్ ఫిబ్రవరి 26 ఈతరం భారతం:
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా వెల్దండి గ్రామానికి చెన్దిఒన సత్తురి ఆంజనేయులు గౌడ్ నియమిర్తులైనారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి రాజ్య సభ సబ్యులు ఆర్.కృష్ణయ్య బిసి భవన్ లో జరిగిన కార్యక్రమం లో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రము లోని బిసిల సమస్యలపై ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.బిసి లకు 42 శతం రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బిసిల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని హెచ్చ రించారు.అనంతరం ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తనపై గల నమ్మకతో తనక్కు ఈ పదవిని అప్పగించిన ఆర్. కృష్ణయ్య కు అందుకు సహకరించిన డా.అరుణ్ కుమార్ కు కృతఙ్ఞతలు తెలిపారు.















