EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పసి కందును కొట్టి చంపిన పెత్తo దారులను కటి నంగా శిక్షించాలి పిఓడబ్లు జాతీయ అధ్యక్షురాలుసంపంగి పద్మక్క,ప్రధాన కార్యదర్శి వెలుగు వనిత డిమాండ్

హైదరాబాద్ ఫిబ్రవరి 23 ఈతరం భారతం:

నగర కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రజక కుటుంబం పై దాడి చేసి, రెండేళ్ల పసికందును కళ్ళతో తన్ని నేలకేసి కొట్టి హత్య చేసిన అగ్రకుల పెంతందరాలను కటినంగా శిక్షించాలని pow విముక్తి జాతీయ కార్యదర్శి వెలుగు వనిత ప్రసిడెంట్ సంపంగి పద్మక్క ఒక ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ న్నీ డిమాండ్ చేశారు,బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు,జాతరలో దైవ దర్శనం కోసం వెళ్తున్న కారణంతో బాలికతో పాటు వేళ కూoడా చేసిన అగ్రకుల పెంతందరాలు,కులం పేరుతో దూషిస్తూ రజక కుటుంబం దైవ దర్శనం జీర్ణించుకోలేని అగ్రవర్ణాల కుల దురహంకారంతో రెండేళ్ల పాపా అని చూడ కుండా కళ్ళతో తన్ని,బండకేసి కొట్టి చంపడం సభ్య సమాజం తలా దించుకునేలా ఉందన్నారు ,బాధిత కుటుంబాo పైనే పోలీస్ కేసు పెట్టడం దారుణం ,వేలాది మంది ప్రజల ముందే గణేష్ అనే వ్యక్తిని గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చెయ్యడం పోలీసులు నిర్లక్ష్యం రాష్ట్ర o లో కింది కులాల పై హత్యలు,దాడులు,హత్యాచారాలు పెరిగి పోయాయని పేర్కొన్నారు ,వీటిని రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయక పోతే ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు

Related News

Select the Topic
Scroll to Top