ఈతరం భారతం హైద్రాబాద్ మే 30;
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రికత అనంతరం తెలంగాణ భవన్ వద్ద సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుమన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనను మరోసారి జైలుకు పంపాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారన్న సుమన్.. జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలని భావిస్తున్నారని ఆరోపించారు.
వివిధ సెక్షన్లపై కేసునమోదు : మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలంటూ ఇటీవల బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో.. సుమన్పై 326(జి), 351(3), 353(1)(బి), రెడ్ విత్ 55, రెడ్ విత్ 61(2)(ఎ), బీఎన్ఎస్ 4 పీడీపీపీఏ కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు గో బ్యాక్ అంటూ : బాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కొంతసేపు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు మాట్లాడారు. నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశామని, అందువల్ల ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.














