ఈ తరం భారతం హైదరాబాద్: మే 31
కరీంనగర్ కు చెందిన బాలల కధా రచయిత మాస్టర్ స్నితిక్ పటేల్ ఆంగ్లంలో రచించిన టువెల్వ్ పెరల్స్ కథల పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆదివారం రవీంద్ర భారతిలో అందుకున్నారు. స్నితిక్ పటేల్ తరపున అతని అమ్మమ్మ ప్రముఖ రచయిత్రి వసంత పుస్తకాన్ని నరసింహారెడ్డికి అందజేశారు. స్నితిక్ ఆంగ్ల కథా రచనను డాక్టర్ నరసింహారెడ్డి ప్రశంసించారు.














