EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మిలియన్ డాలర్స్ ఇస్తామని ఉరిశిక్ష ఆపా : కేఏ పాల్

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 15: మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.నిమిషాను రక్షించడంలో 8 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మోడీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చెప్పారన్నారు. కానీ అది అబద్ధం అన్నారు. హూతీ సిటీలో ప్రభుత్వం ఉందని చెప్పారు. వాళ్లను తాను కలిశానని, మోస్ట్ పాపులర్ ముస్లీం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారని అన్నారు.ఈ మిషన్ లో తనకు మూడు రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలు సాయం చేశారన్నారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా..తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని తాను మళ్లీ యెమన్ లీడర్లను కలుస్తానని కేఏ పాల్ చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top