EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మే 10 న సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్ ఆద్వర్యం లో మాతృ సన్మాన మహోత్సవం

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 26

శ్రీ సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. లక్ష్మీ అన్నదాత ఆధ్వర్యంలో, మాతృమూర్తి కీ. శే. సరస్వతి దేవి జ్ఞాపకార్ధం “మే 10వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు” ఘనంగా విశిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. లక్ష్మీ అన్నదాత తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాస్ట్లడుతూ “మాతృ సన్మాన మహోత్సవం” పేరిట వివిధ రంగాలలో విజయాలు సాధించి ఈ సమాజానికి తమ వంతు సేవలను అందిస్తున్న వారి తల్లులను (108 మందిని) ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి పాత్ర అపారమైనది. తల్లి ప్రేమ, త్యాగం, మార్గదర్శకత్వం సమాజానికి బలమైన పునాది. ఈ కార్యక్రమం ద్వారా మాతృప్రేమ గొప్పతనాన్ని గౌరవించడం తో పాటుగా, వారి సేవల నీడలో కలిసిపోయిన ఎన్నో త్యాగాలను రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ఈ వేదికను ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖులు, గౌరవ అతిథులు, సామాజిక నాయకులు హాజరై తల్లుల సేవలను కొనియాడనున్నారు. సన్మాన కార్యక్రమంతో పాటు ప్రేరణాత్మక ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబఫైటయని ఆమె వివరించారు

Related News

Select the Topic
Scroll to Top