ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 15 :దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలన నుండి దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులతో భరతమాత స్వయంపాలన దిశగా అడుగులేసి, నేటికి 79 ఏండ్లు గడిచినాయని పేర్కొన్నారు. త్యాగనిరతితో ఎందరో అమరవీరులు, దేశ భక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని తెలిపారు.దేశ స్వాతంత్య్రం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను కేసీఆర్ స్మరించుకున్నారు.















