ఈతరం భారతం హైదరాబాద్ మే 30
వడ్రంగి, స్వర్ణకార, కమ్మర, కంచరి మరియు శిల్పులను విశ్వబ్రాహ్మ ణులు గా గుర్తించాలనిఅఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాధం విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు TPCC అధ్యక్షులు మహేష్ గౌడ్ ను గాంధీ భవన్ లో కలిసి మన పంచ వృత్తులైనవడ్రంగి, స్వర్ణకార, కమ్మర, కంచరి మరియు శిల్పుల జనాభాను ఏకీకృతం చేసి విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ కులం గా పరిగణించి ప్రకటించుటకు ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞాపన పత్రము అందజేసారు. అందుకు మహేష్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ దానికి ఆయన అలాగే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన కౌలే జగన్నాధం అధ్యక్షులు, పడాల సతీష్ చారి అధికార ప్రతినిధి, కనపర్తి లక్ష్మణ్ చారి గౌరవ సలహాదారు, కొల్లోజు శ్రీనివాస్ చారి ఉపాధ్యక్షులు, కస్తోజు శ్రావణి మహిళా అధికార ప్రతినిధి , మూట కోడూరు పద్మశ్రీ అధ్యక్షులు కల్చరల్ కమిటీ మరియు కె లోకనాథం EC మెంబర్ తదితరులు హాజరైన్నారు














