ఈతరం భారతం హైదరాబాద్ మే 10
రాష్ట్రంలో భూముల ధరల సవరణ చేపట్టనున్న నేపథ్యంలో ప్రజల నుంచి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున రద్దీ ఉండే కార్యాలయాల్లో పని గంటల వ్యవధిని పెంచుతున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి అదనంగా మరో రెండు గంటలపాటు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.















