ఈతరం భారతం హైద్రాబాద్ (ఉప్పల్ )మే 30:
సరస్వతి పుష్కరాల కోసం వెళ్లే భక్తులకు స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెంగిచెర్ల డిపో మేనేజర్ కే.కవిత తెలిపారు. కాళేశ్వరం, పుష్కరఘాట్, భద్రకాళి ఆలయం వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలకు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.600గా నిర్ణయించినట్లు తెలిపారు. రేపు ఉదయం 7:00 గంటల నుంచి సర్వీసులు ఉంటాయని తెలిపారు.
ఏవేని కాలనీ వాసులు 20,30 పుష్కరాలకు వెళుతామని తెలిపితే వారికోసం ప్రత్యేక బస్సు ను పైన్స్ పేర్కొన్న ఛార్జీలకే ఏర్పాటు చేయనున్నట్లు కవిత వివరించారు.మరిన్ని వివరాలకు 9110505820, 9948886516 నంబర్లను సంప్రదించాలని సూచించారు.














