హైదరాబాద్ ఆగస్టు 13 (ఈతరంభారతం); హైదరాబాద్లోని చిక్కడపల్లి న్యూ ఎరా కాలేజీ ఎదురుగా భాగ్ లింగంపల్లి రోడ్డులో గల శ్రీకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఈనెల 15 16 17 తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ టీ గౌరీ శంకర్ తెలిపారు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే నృత్యాలు, గోపూజ, సంగీత నృత్య భజన కీర్తనలు వేద పారాయణం ధార్మిక ప్రసంగాలు ప్రముఖులకే ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు అతిథులుగా డాక్టర్ కె.వి.రమణాచారి, పివి మనోహర్రావు ,ముఠా గోపాల్, రవి చారి, డాక్టర్ కె.వి.కృష్ణకుమారి, నంగునూరు చంద్రశేఖర్, నిట్టల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు















