ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 3
తెలంగాణ : త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 31.56 లక్షల మంది అభ్యర్థులు.. తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, తాజా ఫొటోతో పాటు అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. గడువు దాటితే భవిష్యత్ నియామకాలకు అనర్హత తప్పదని హెచ్చరించింది.















