ఈతరం భారతం కరీంనగర్ మే 31
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాకళ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు పాల్కురికి సోమన్న వేదికగా నిర్వహించే రాష్ట్రస్థాయి మహిళా వారోత్సవాల కవి సమ్మేళనంలో కరీంనగర్ కు చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి పి. వసంత పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం లో పాల్గొంటున్న వసంతకు పలువురు కవులు, సాహితీవేత్తలకు అభినందనలు తెలిపారు.














