ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 15 :ఖమ్మం మున్నేరు వరద ప్రవాహాన్ని మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మున్నేరు పరివాహ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎగువ నుంచి భారీగా వరద ఉధృతి ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వరద అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సహాయ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసి సన్నద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు చెప్పారు.















