EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించండి..మంత్రి పొంగులేటి

ఈతరంభారతం ఖమ్మం జూలై 27 :ఆపదలోనూ నేనున్నా అని మరోమారు చాటుకున్నారు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి.ఇదే సమయంలో కొత్తగూడెం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న మంత్రి పొంగులేటి ఆ ఘటనను చూసి కాన్వాయ్ ను ఆపారు. అధైర్య పడొద్దని.. నేనున్నానని ప్రమాదంలో గాయపడిన యువకులకు భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ సాంబశివరావును దగ్గరకు పిలిచి క్షతగాత్రులను త్వరగా కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top