EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సోదర భావంతో మంత్రికి రాఖీలు

ఈతరంభారతం ఖమ్మం ఆగస్టు 9 :శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయం పండుగ వాతావరణంలో మెరిసింది. వివిధ హోదాల్లో ఉన్న మహిళలు, గృహిణులు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సోదర భావంతో రాఖీలు కట్టి శుభాకాంక్షలు అందించారు.“మీరు మా సోదరుడు మాత్రమే కాదు… మా కుటుంబానికి అండ” అని పలువురు మహిళలు హృదయపూర్వకంగా పేర్కొన్నారు. మంత్రి కూడా స్నేహపూర్వకంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుభకార్యక్రమాలకు హాజరైన మంత్రి, అక్కడ కూడా మహిళల నుంచి రాఖీలు కట్టించుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top