ఈతరం భారతం జడ్చర్ల నవంబర్ 20:
జాతీయ రహదారి 44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు.దట్టంగా వ్యాపించిన పొగలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బస్సు దిగిన ప్రయాణికులు .మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన ప్రైవేటు బస్సు.ట్యాంకర్ల కెమికల్స్ ఉండడంతో దట్టంగా పొగలు వ్యాపించగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దిగి ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులు.ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్లోని హైడ్రో ఫ్లోరిక్ యాసిడ్ను ఖాళీ చేసిన సిబ్బంది. చిత్తూరు నుండి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో 26 మంది ఉన్నారు. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం.














